ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం హైపర్ టెన్షన్ డేను నిర్వహించారు. డిప్యూటీ డీఎంహెచ్వో సెల్వియా సాల్మన్ మాట్లాడుతూ. 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ప్రతి 6 నెలలకు ఒకసారి బీపీని చెక్ చేయించుకోవాలని, ఆహార నియమాలు వ్యాయామం వంటి వాటిని తప్పకుండా అనుసరించాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ డాక్టర్లు మాధవి, పుష్పలత, వైద్య సిబ్బంది డాక్టర్ రాజశేఖర్, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.