ఏపీలో రైలు ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఏపీ మీదుగా ప్రత్యేక రైళ్లను మరికొద్దిరోజులు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. విశాఖపట్నం-సికింద్రాబాద్-విశాఖపట్నం (08579/08580) రైళ్లను జూన్ 27 వరకు.. విశాఖ-తిరుపతి-విశాఖ రైళ్లను జూన్ 25 వరకు.. విశాఖ-కర్నూలు-విశాఖ రైళ్లను జూన్ 26 వరకు పొడిగించినట్లు తెలిపింది.
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఇప్పటికే పలు ప్రాంతాల మధ్య సేవలందిస్తోన్న 32 ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగించింది. ఈ రైళ్లు ఏప్రిల్ నుంచి జూన్ వరకు నిర్దేశిత తేదీల్లో సర్వీసులందిస్తాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు సర్వీసులందించే ఈ ప్రత్యేక రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
సికింద్రాబాద్ – అగర్తలా(07030), అగర్తలా – సికింద్రాబాద్(07029), సికింద్రాబాద్ – డిబ్రుగడ్(07046), డిబ్రుగడ్ – సికింద్రాబాద్(07047), తిరుపతి – సాయినగర్ షిర్డీ(07637), సాయినగర్ షిర్డీ - తిరుపతి(07638), హైదరాబాద్ -ఘోరఖ్పూర్(02575), ఘోరఖ్పూర్ – హైదరాబాద్(02576), సికింద్రాబాద్ – రక్సెల్(07007), రక్సెల్ – సికింద్రాబాద్(07008), హైదరాబాద్ –రక్సెల్ (07051), రక్సెల్ – హైదరాబాద్(07052), సికింద్రాబాద్ – ధనాపూర్(07419), ధనాపూర్ – సికింద్రాబాద్(07420), హైదరాబాద్ – జైపూర్(07115), జైపూర్ – హైదరాబాద్(07116), షోలాపూర్ – ఎల్ టీటీ ముంబై(01435), ఎల్టీటీ ముంబై – షోలాపూర్(01436), తిరుపతి – షోలాపూర్(01438), షోలాపూర్ – తిరుపతి(01437) రైళ్లు జులై 1 వరకు అందుబాటులో ఉంటాయని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు కోరారు.