ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సచివాలయం తాకట్టుపెట్టి అప్పులా.. జగన్‌పై చంద్రబాబు ఫైర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 03, 2024, 04:14 PM

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎం జగన్ మీద మరోసారి విమర్శలు గుప్పించారు. ఎక్స్ వేదికగా సీఎం మీద ఆరోపణలు చేశారు. సచివాలయాన్ని తాకట్టుపెట్టి అప్పులు తేవడం ఏమిటంటూ ప్రశ్నించారు. ఇది ఏపీకి చాలా అవమానం అంటూ సీఎం జగన్ తీరు మీద విరుచుకుపడ్డారు. జగన్ తాకట్టుపెట్టింది భవనాలను కాదు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని అంటూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.‘రూ.370 కోట్లకు రాష్ట్ర పాలనా కేంద్రాన్ని తాకట్టు పెట్టడమేంటి? జగన్‌ తాకట్టు పెట్టింది భవనాలను కాదు.. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని. ముఖ్యమంత్రి సమున్నతమైన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ను నాశనం చేశారు. అసమర్థ, అహంకార పాలనలో ఏం కోల్పోతున్నామో ఆలోచించాలి’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.


మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం ఏపీ ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. జగన్ తెస్తున్న అప్పులను చూసి ఆర్థికవేత్తలకు, మేధావులకు సైతం మైండ్ బ్లాంక్ అవుతోందంటూ విమర్శించారు.. రాష్ట్రాన్ని 12న్నర లక్షల కోట్ల అప్పులపాలు చేసిన సీఎం జగన్.. ఇప్పుడు ఏకంగా సచివాలయాన్నే తాకట్టు పెట్టారన్న వార్త చూసి ఉదయాన్నే షాక్ తిన్నానని చెప్పారు. దీనికి వైసీపీ మేధావులు ఏం సమాధానం చెప్తారంటూ ప్రశ్నించారు. ఎంత సంక్షోభంలో చిక్కుకున్నప్పటికీ శ్రీలంక తమ పాలనా కేంద్రాన్ని తాకట్టుపెట్టలేదన్న లోకేష్.. ఇప్పుడు మన రాష్ట్రాన్ని శ్రీలంకతో పోల్చడం కూడా కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు.


ఇంత కంటే దిగజారలేరు అని అనుకున్న ప్రతిసారీ జగన్ మరో మెట్టు జారిపోతున్నారన్న నారా లోకేష్.. ఇలాంటి వారిని ఏమనాలని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ పరువును అంతర్జాతీయస్థాయిలో మంటగలుపుతున్న ఈ సీఎంను ఏమనాలో, ఎవరితో పోల్చాలో మాటలు రావడం లేదని సెటైర్లు వేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com