తిరుమలలో ఇవాళ భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి సర్వదర్శనం కోసం భక్తులు ఆరు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి ఉచిత దర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. ఇక టైమ్ స్లాట్ టోకెన్లు బుక్ దర్శనం, దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు 3 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 92,268 మంది భక్తులు దర్శించుకున్నారు. 12,592 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారికి హుండీ ద్వారా రూ.3 కోట్ల 3వేల ఆదాయం సమకూరింది.