శ్రీకాకుళంః శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ రోజు 326వ రోజు ప్రజాసంకల్ప యాత్ర నిర్వహించనున్నారు. జగన్ పాదయాత్రను దుర్గమ్మపేట శివారు నుంచి ప్రారంభించనున్నారు. పాదయాత్ర లక్ష్మీపురం క్రాస్, సవరపేట క్రాస్, శివరాంపురం క్రాస్, సంతబొమ్మాళి, బోరబద్ర క్రాస్, జగన్నాథపురం క్రాస్, వడ్డితాండ్ర మీదుగా దండుగోపాలపురం వరకు కొనసాగనుంది. పాదయాత్రలో భాగంగా దండుగోపాలపురంలో జగన్ ప్రజలతో మమేకం కానున్నారు. పాదయాత్రలో ఇప్పటివరకు జగన్ 3,486.9 కిలోమీటర్లు నడిచారు.