అమరావతి: ఉద్యాన పంటల్లో రాయలసీమ దేశానికే తలమానికమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కియా రాకతో ఆటోమొబైల్ రంగంలో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు.కర్నూలు జిల్లాలో 15 యూనిట్లు ఉత్పత్తి దశలో ఉన్నాయని చెప్పారు.రాష్ట్రాభివృద్ధిని యజ్ఞంలా చేస్తుంటే కొంతమంది అడ్డుపడుతున్నారని సీఎం మండిపడ్డారు.రాజధాని నిర్మాణానికి సొంతంగా నిధులు సమకూర్చుకుంటున్నామన్నారు.పోలవరానికి డబ్బులు ఇవ్వకపోయినా పనులు కొనసాగిస్తున్నామని, నదుల అనుసంధానం వల్లే రాయలసీమకు పుష్కలంగా సాగునీరు అందిస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.