అహ్మద్నగర్: ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్టేజ్ మీదే మూర్చపోయారు. దీంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. షుగర్ లెవల్ తక్కువ కావడం వల్లే తాను మూర్చపోయినట్లు ఆ తర్వాత గడ్కరీ ట్వీట్ చేశారు. అయితే చికిత్స తర్వాత ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. రాహూరిలోని మహాత్మా ఫూలే కృషి విద్యాపీఠ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కాన్వొకేషన్ ఫంక్షన్లో పాల్గొన్న సందర్భంగా జాతీయ గీతం పాడే సమయంలో నిల్చున్న గడ్కరీ.. సడెన్గా మూర్చబోయారు. ఆ సమయంలో గవర్నర్ విద్యాసాగర్రావు కూడా అక్కడే ఉన్నారు. గడ్కరీ పడిపోయిన సమయంలో ఆయనను పట్టుకోవడానికి విద్యాసాగర్రావు వెళ్లారు.