న్యూఢిల్లీ : చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్ను నియమించారు. మూడేళ్ల పాటు ఆయన ఆర్థిక సలహాదారుడిగా విధులు నిర్వర్తించనున్నారు. ఇటీవలే మాజీ సీఈఏ అరవింద్ సుబ్రమణియన్ తన పదవికి రాజీనామా చేశారు. చికాగో స్కూల్ ఆఫ్ బిజినెస్లో కృష్ణమూర్తి పీహెచ్డీ చేశారు. బ్యాంకింగ్, కార్పోరేట్ గవర్నెన్స్, ఎకనామిక్ పాలసీలో ఈయన దిట్ట. సెబీతో పాటు ఆర్బీఐ నిపుణుల కమిటీలో చేశారాయన. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ప్రస్తుతం సుబ్రమణియన్ అసోసియేట్ ప్రొఫెసర్గా చేస్తున్నారు. జూన్ 30వ తేదీన ఆర్థిక సలహాదారు పోస్టు కోసం కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. అరవింద్ తన పదవీ కాలం పూర్తి చేసుకోకముందే రాజీనామా చేసిన విషయం తెలిసిందే.