ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టిడిపి చేస్తున్న అక్రమాలపై ఎందుకు మాట్లాడలేదు నిమ్మగడ్డ ?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 06, 2023, 12:42 PM

ఎన్నికల కమీషనర్ గా పనిచేసినప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ఎన్ని అక్రమాలకు పాల్పడ్డావో ప్రజలందరికి తెలుసు అని లేళ్ళ అప్పిరెడ్డి అన్నారు. టిడిపికి ఎలా అనుకూలంగా పనిచేశావో గుర్తుతెచ్చుకో.ఇకనైనా దొంగవేషాలు మానుకోవాలని సూచించారు. హైద్రాబాద్ లో చంద్రబాబు ఓటర్ల నమోదుకు సంబందించి చేస్తున్న అక్రమాల గురించి ఏం సమాధానం చెబుతావని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం పేరిట సంస్ధను పెట్టి గతంలో పనిచేసినప్పుడు దుగ్గిరాలలో ధర్నా చేశారు.దుగ్గిరాలలో ఓట్లు తొలగిస్తున్నారు. ఈ ప్రాంతంలో లేని వారి ఓట్లను blo లు విచారించి తీసివేస్తే అదేదో అపరాధం చేసినట్లు ఆందోళన చేస్తే దానికి పచ్చమీడియా భారీఎత్తున ప్రచారం చేసింది.అప్పుడు అలా చేసిన నిమ్మగడ్డ ఇప్పుడు టిడిపి చేస్తున్న అక్రమాలపై ఎందుకు నోరుమెదపరని ప్రశ్నించారు. వాలంటీర్లను ఓటర్ల జాబితా కు సంబంధించి వినియోగించకపోయినా కూడా వాలంటీర్లను వాడుతున్నారని సుప్రీంకోర్టులో కేసు వేసి దుర్మార్గానికి ఒడిగట్టారని అన్నారు.నిమ్మగడ్డ లాంటి వ్యక్తుల ఆటలు ఎల్లకాలం కొనసాగవని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com