ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును ఇండోనేషియా మంత్రి సోఫియాం ఏ జలిల్ కలిశారు. రాష్ట్రంలో ‘పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయం’పై సోఫియాం సీఎం చంద్రబాబుతో చర్చించారు. ఏపీలో జెడ్ బీ ఎన్ఎఫ్ పై అధ్యయనం చేసి తమ దేశంలో అమలు చేస్తామని సోఫియాం తెలిపారు. ఏపీ నైపుణ్య సలహాలను అనుసరించడమే పర్యటన ఉద్దేశమని సోఫియాం తెలిపారు. ఇండోనేషియాలో పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయానికి సహకారం అందిస్తామని సీఎం వెల్లడించారు.