స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం నందు బుధవారం ఘనంగా రాష్ట్రస్థాయి బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలో ముఖ్య అతిధిగా రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ, సెర్ప్ శాఖ మంత్రి పరిటాల సునీత పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి బాలల దినోత్సవ వేడుకలు-2018 కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి పరిటాల సునీత పండిట్ జవహర్ లాల్ నెహ్రు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ గద్దె అనురాధ, కార్యదర్శి హెచ్. అరుణ్ కుమార్, బాలల హక్కుల పరిరక్షణ సమితి ఛైర్పర్సన్ జి. హైమావతి, తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి పరిటాల సునీత అన్నీ మర్చిపోయి పిల్లలతో గడపటం చాలా సంతోషంగా ఉందని.. అంగన్ వాడీ టీచర్లు కూడ పిల్లలతో కలిసి ఆడిపాడుతూ పిల్లలకు నేర్పిస్తున్నారన్నారు. అంగన్ వాడీలను మెర్జిచేసి ప్రీస్కూల్స్ గామార్చి నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యనందిస్తున్నామని.. బడికి వెళ్లాల్సిన బాలలను కార్మికులుగా పని చేయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. సి.ఎం గారు చంద్రన్న పెళ్లి కానుక ప్రవేశపెట్టాక చాలా వరకు బాల్య వివాహాలు తగ్గాయన్నారు.