ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిత్తూరు జిల్లాలో ఇంటర్ విద్యార్థితి అనుమానస్పద మృతి,,,,పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 24, 2023, 10:18 PM

చిత్తూరు జిల్లా పెనుమూరులో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి సంచలనం రేపుతోంది. అమ్మాయి మృతదేహం ఉన్న స్థితిని చూసి.. పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమ్మాయికి అరగుండు చేసి.. కనురెప్పలు కత్తిరించి.. బావిలో పడేసి ఉండటం ఇప్పుడు సర్వత్రా సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. కావూరి వారి పల్లె పంచాయతీ ఠాణా వేణుగోపాలపురానికి చెందిన భవ్యశ్రీ 17వ తేదీన రాత్రి అదృశ్యమైంది. కాగా.. తమకు తెలిసిన అన్ని చోట్లలో అమ్మాయి కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో.. 18 వ తేదీన భవ్యశ్రీ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. అయితే.. 20 వ తేదిన గ్రామంలో వినాయక నిమజ్జనం చేస్తుండగా ఓ బావిలో భవ్యశ్రీ మృతదేహం కనిపించింది.


గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే.. మృతదేహాం శిరోముండనం చేసి, కనురెప్పలు కత్తిరించిన స్థితిలో ఉంది. అయితే.. పోలీసులు దీన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం.. ఆస్పత్రికి తరలించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. కుటుంబ సభ్యులు మాత్రం.. భవ్యశ్రీని అత్యంత కిరాతకంగా చంపేసి గుర్తుపట్టుకుండా చేసి బావిలో పడేశారని ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఆరోపణలను కూడా పరిగణలోకి తీసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు అనుమానితులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే.. మృతదేహం దొరికి 4 రోజులవుతున్నా.. ఇప్పటివరకు ఏ విషయాన్ని చెప్పట్లేదని.. భవ్యశ్రీ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని వడ్డెర సంఘం నాయకులు పెనుమూరు పోలీసు స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. దీంతో.. పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com