రాజమహేంద్రవరం : పశ్చిమ గోదావరి జిల్లాలో ఎర్రకాల్వ వల్ల ఎక్కువ నష్టం జరిగిందని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో వరదలపై ఏరియల్ వ్యూ లో పరిశీలించిన అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ…కాజ్ వేల పునర్నిర్మాణం కోసం నిధులు కేటాయిస్తున్నామన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు. ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన పరిహారం చెల్లిస్తామన్నారు. హెక్టార్ కు రూ.25వేల నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. ఎర్రకాల్వ ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రయత్నిస్తామన్నారు. ఆర్అండ్ బీ రహదారులకు రూ.35కోట్లు కేటాయిస్తామన్నారు. రాయలసీమలో కరువు ఉంది..కోస్తాలో వరదలు వచ్చాయన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో 6600 హెక్టార్లలో పంటనష్టం జరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని 19 మండలాల్లో 45 గ్రామాలకు వరద తాకిడి ఉందన్నారు. బాధితుల కోసం 16 పునరావాస కేంద్రాలు నడుస్తున్నాయన్నారు.