అనంతపురం : రాయదుర్గం నియోజకవర్గం లోని భూమి లేని ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులకు భూ కొనుగోలు పథకం కింద భూమిని అందజేయడానికి నా వంతు కృషి చేస్తానని రాష్ట్ర గ్రామీణ గృహ నిర్మాణ, ,పౌర సంబంధాలు శాఖ మంత్రి వర్యులు కాలవ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. తారకపురం, బొమ్మనహల్, గోవిందవాడ, సింగెపల్లి దళితులకు ఆయన హామి ఇచ్చారు. నియోజకవర్గంలో వివిధ మండలాల్లో వివాహాది శుభకార్యక్రమాలకు మంత్రి హాజరు అయి నూతన వధువరులను ఆశీర్వదించారు. అనంతరం మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రికి భూమిని ఇప్పించవలసిందిగా దళితులు వినతి పత్రాని అందజేశారు.