నాటింగ్హామ్: భారత్-ఇంగ్లాండ్ల మధ్య మూడో టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. భారత్ను మొదట బ్యాటింగ్కు ఆహ్వానించింది. శిఖర్ ధావన్- కేఎల్ రాహుల్ భారత ఇన్నింగ్స్ను ప్రారంభించారు. దూకుడుగా ఆడే ధావన్ ఎంతో నెమ్మదిగా ఆడుతున్నాడు. మరో వైపు కేఎల్ రాహుల్ కూడా నెమ్మదిగా తన ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. ఆరు ఓవర్లు ముగిసే సమయానికి భారత్ వికెట్ ఏమీ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ధావన్ 10, కేఎల్ రాహుల్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.