వరదలతో అతలాకుతలమవుతున్న కేరళ ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చేయూతనిచ్చింది. అక్కడి చిన్నారుల ఆకలిబాధలు తీర్చేందుకు సుమారు 100 మెట్రిక్ టన్నుల బాలామృతం ఆహారాన్ని కేరళకు తరలించనుంది. బాలామృతం పథకం కింద నాచారంలోని తెలంగాణ ఫుడ్స్లో సిద్ధం చేసిన పౌష్టికాహారాన్ని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక సైనిక విమానంలో కేరళకు తరలించనున్నారు. ఏడు నెలల పిల్లల నుంచి మూడేళ్ల వయస్సున్న పిల్లలకు ఈ సమయంలో పౌష్టికాహారంగా బాలామృతం ఉపయోగపడుతుంది.