జైపూర్ : రాజ్పుత్రులను ఎలుకలతో పోల్చిన రాజస్థాన్ మంత్రి కిరణ్ మహేశ్వరి ముక్కు, చెవులు కోసేస్తామని శ్రీ రాజ్పుట్ కర్నిసేన నేతలు ప్రకటించారు. రాజ్పుత్రులపై వ్యాఖ్యలు చేసినందుకుగాను తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కర్నిసేన రాష్ట్ర అధ్యక్షుడు మహిపాల్ సింగ్ మక్రానా మంత్రి మహేశ్వరిని హెచ్చరించారు. కాగా తాను రాజ్పుత్రులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, కాంగ్రెస్కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను రాజ్పుత్రులకు అన్వయిస్తూ సమాజంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని మంత్రి వివరణ ఇచ్చారు.