అమరావతి : అనుమతి లేని స్కూళ్ల బస్సులను సీజ్ చేయాలని రవాణా శాఖ అధికారులను మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. పాఠశాలల పున:ప్రారంభం నేపథ్యంలో మంత్రి గంటా అధికారులకు, ఉపాధ్యాయులకు కొన్ని సూచనలు చేశారు. విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సమస్యలు ఉంటే డిఇఒలు, పిఒలతో మాట్లాడి పరిష్కరించుకోవాలన్నారు. మౌలిక సదుపాయాల్లేని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలపై చర్యలకు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకోవాలని డిఇఒలకు ఆదేశాలు జారీ చేశారు.