ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ నిర్ణయం అద్భుతం... విజయసాయిరెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 20, 2023, 06:02 PM

పాకిస్థాన్, చైనా దేశాల పౌరసత్వం తీసుకున్న వారు మనదేశంలో వదిలివెళ్లిన ఆస్తులను అమ్మాలన్న నిర్ణయం అద్భుతమని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశంసలు కురిపించారు. సోమవారం ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.


‘‘పాకిస్థాన్, చైనా జాతీయులకు చెందిన 12,611 శత్రు ఆస్తులను అమ్మాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల నగరాల్లోని ప్రధాన ప్రాంతాల్లో చాలా వరకు ఖాళీ భూమి దొరుకుతుంది. కేంద్ర ప్రభుత్వానికి దాదాపు రూ.1 లక్ష కోట్ల ఆదాయం కూడా వస్తుంది’’ అని పేర్కొన్నారు. ఇదిలాఉంటే పాకిస్థాన్, చైనా దేశాలకు చెందిన వాళ్లు మనదేశంలో వదిలివెళ్లిన ఆస్తులను అమ్మాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com