హైదరాబాద్ : ఉప ఎన్నికల ఫలితాలు స్థానిక పరిస్థితులపై ఆధారపడి ఉంటాయని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. హైదరాబాద్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ… సాధారణ ఎన్నికల్లో గెలుపు మాదేనన్నారు. మూడో కూటమి సాగేది కాదన్నారు. ప్రధాని అవుతానంటూ రాహుల్ చెప్పుకోవడంలో అభ్యంతరం లేదన్నారు. హైకోర్టు విభజనలో ఏపీ స్థలం ఇస్తే నోటిఫై చేయడం తప్ప చేసేదేమీ లేదన్నారు. హైకోర్టు విభజన అంశం సుప్రీంకోర్టు ముందుందన్నారు. అమరావతిలో హైకోర్టు భవన నిర్మాణం పూర్తయితే విభజన నోటిఫై చేస్తామన్నారు.