తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయయి. శ్రీవారి సర్వ దర్శనానికి 26 గంటల సమయం పడుతోంది. కాలినడక భక్తులు స్వామి వారిని దర్శించుకోవడానికి నాలుగు గంటల సమయం పడుతోంది. అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు కూడా స్వామి వారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది.