బెంగుళూరు: కర్నాటక సీఎం కుమారస్వామి ఇవాళ అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోనున్నారు. బల నిరూపణ పట్ల తనకేమీ టెన్షన్ లేదన్నారు. స్పష్టంగా తాను బలపరీక్షలో నెగ్గనున్నట్లు ఆయన ఇవాళ తెలిపారు. బుధవారం సీఎంగా ప్రమాణం చేసిన జేడీఎస్ నేత కుమారస్వామికి కాంగ్రెస్ మద్దతు ఉన్నది. జేడీఎస్కు 36, కాంగ్రెస్కు 78 సీట్లు ఉన్నాయి. మరో బీఎస్పీ సీటు కూడా ఈ కూటమి ఖాతాలో పడే ఛాన్సుంది. మొదట ఆ రాష్ట్ర గవర్నర్ ఆదేశం ప్రకారం.. యడ్యూరప్ప సీఎంగా ప్రమాణం చేసినా.. ఆయన అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోలేకపోయిన విషయం తెలిసిందే.