బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో చిన్న ట్విస్ట్. మేజిక్ ఫిగర్ దిశగా దూసుకుపోతున్నదనుకున్న బీజేపీ కొంచం దూరంలోనే నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తున్నది. మ్యాజిక్ ఫిగర్ కు 7 స్థానాల దూరంలో బీజేపీ ఉంది. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే జేడీఎస్ మద్దతు తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు విషయంలో జేడీఎస్ కీలకంగా మారింది. బీజేపీ జేడీఎస్ మద్దతు కోరుతుందా? లేక ఆ పార్టీ చీలుస్తుందా అన్న సందేహాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ కు 75 స్థానాలు, జేడీఎస్ కు 39 స్థానాలు లభించే అవకాశం ఉండటంతో ఆ రెండు పార్టీలూ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలను కూడా కొట్టి పారేయలేమని అంటున్నారు.