హైదరాబాద్ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల విజయంతో దక్షిణాదిలో బీజేపీ జైత్రయాత్ర ప్రారంభమైందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ రానున్న రోజలలో ఏపీతో సహా దేశంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 2019 ఎన్నికలలో ఏపీలో తెలుగుదేశం పార్టీ పరాజయం తథ్యమన్నారు.