న్యూఢిల్లీ: పఠాన్కోట్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇద్దరు వ్యక్తులు ఆయుధాలతో ఇండియన్ ఎయిర్ఫోర్స్ స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. 2016లో ఇదే ఎయిర్బేస్ వద్ద ఉగ్రవాదులు దాడి చేశారు. దీంతో ఆ ప్రాంతంలో సెక్యూర్టీని పెంచేశారు. మారుతి సుజికి కారును కూడా ఆ ఇద్దరు హైజాక్ చేసినట్లు తెలిసింది. తన కారును చోరీ చేసినట్లు దాని ఓనర్ కూడా ఫిర్యాదు చేశాడు. సెర్చ్ ఆపరేషన్ కూడా మొదలుపెట్టారు. రెండు ఏళ్ల క్రితం ఎయిర్బేస్పై జరిగిన దాడిలో ఏడుగురు భద్రతా సిబ్బంది చనిపోయారు.