న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం సభ్యుడు సుజనా చౌదరి మంత్రి పదవికి తన రాజీనామాకు దారి తీసిన పరిస్థితులపై రాజ్యసభలో ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ విషయంలో అనుసరించిన వైఖరి, విభజన హామీల అమలులో నిర్లక్ష్యం కారణాలతోనే తన పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. సుజనా చౌదరి ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్, బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.