న్యూఢిల్లీ : పవన్ కల్యాణ్ వ్యాఖ్యల వెనుక హస్తిన నుంచి వచ్చిన ఆదేశాలు ఉన్నాయని తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకరరెడ్డి అన్నారు. పవన్ కల్యాణ్ సొంత తెలివి లేకుండా ఎవరో ఇచ్చిన ఆదేశాల మేరకు నడుచుకుంటున్నారని విమర్శించారు. లోకేష్ పై పవన్ చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఆవరణలో కేంద్ర వైఖరికి నిరసగా ఆందోళన చేపట్టిన తెలుగుదేశం సభ్యులు పవన్ వ్యాఖ్యలను ఖండించారు. ఆ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన జేసీ దివాకరరెడ్డి నిజంగా అవినీతి జరిగి ఉంటే తామూ ఖండిస్తామనీ, కానీ అలా కాకుండా ఒక స్వీపింగ్ స్టేట్ మెంట్ ఇచ్చేస్తే కుదరదని అన్నారు.