హైకోర్టును రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని రాయలసీమ బీజేపీ నేతలు అన్నారు. ఇవాళ కర్నూలులో బీజేపీ నేతలు సురేష్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, శాంతరెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రెండో రాజధానిని సీమలోనే ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ఆరు నెలలకొకసారి సీమలో అసెంబ్లీ సమావేశాలు జరపాలన్నారు. వచ్చే బడ్జెట్ లో సీమకు రూ.20వేల కోట్ల ప్రత్యేక నిధి కేటాయించాలన్నారు. సీమలోని నాలుగు జిల్లాలను 8జిల్లాలకు పెంచాలన్నారు.