ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి 94వ రోజు ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభమైంది. జగన్ తన 94వ రోజు పాదయాత్రను కొండేపి నియోజకవర్గం తిమ్మపాలెం శివారు నుంచి ప్రారంభించారు. పాదయాత్ర చెరువుకొమ్ముపాలెం, కె.అగ్రహారం, పర్చూరివారిపాలెం, వెంగళాపురం క్రాస్ మీదుగా పెద్దఅలవలపాడు వరకు కొనసాగనుంది. పాదయాత్రలో భాగంగా పర్చూరివారిపాలెం, పెద్ద అలవలపాడులలో జగన్ పార్టీ జెండాలను ఆవిష్కరించనున్నారు. వెంగళాపురం క్రాస్లో జగన్ జనంతో మమేకమవుతారు.