ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడితో ఎంపీలు రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్ భేటీ అయ్యారు. విభజన హామీలు, రాష్ట్రానికి కేటాయింపులు తదితర అంశాలపై వారి సీఎంతో చర్చిస్తున్నారు. ఈ భేటీలో తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకటరావు కూడా పాల్గొన్నారు. కాగా బీజేపీ రాష్ట్ర నేతలు రాష్ట్రానికి కేంద్రం చాలా ఇచ్చిందంటూ ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో అసలు వాస్తవంగా కేంద్రం నుంచి ఇప్పటి వరకూ అందినదేమిటి? అన్నది ప్రజలకు తెలియజేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ నేసథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి రవిచంద్ర, ఏపీ దమ్మాలపాటి కూడా చంద్రబాబుతో సమావేశమయ్యారు.