ఆధ్యాత్మికత, వేగమైన అభివృద్ధి విషయమై ప్రపంచం మనవైపే చూస్తోందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. నగరంలోని పార్క్హయత్ హోటల్లో తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్యకు జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేసిన అనంతరం వెంకయ్య మాట్లాడారు. సభలో వ్యవహారాలను పార్టీలు పరిశీలన చేసుకోవాలని, ప్రజా స్వామ్యంలో ఒకరినొకరు గౌరవించుకోవాలన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఒకరికొకరు శత్రువులు కాదని, కేవలం ప్రత్యర్థులేనన్నారు