ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యకు జీవిత కాల సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి చేతుల మీదుగా ఈ పురస్కార ప్రదానం జరిగింది. ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ తానకు పదవులన్నీ యాధృచ్ఛికంగా వచ్చాయని చెప్పారు. తాను పదవులను, అధికారాన్ని ఎన్నడూ దుర్వినియోగం చేయలేదన్నారు. జై ఆంధ్ర ఉద్యమంతో తన రాజకీయ జీవితం ప్రారంభమైందని చెప్పారు.