పశ్చిమగోదావరి: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వల తీరును నిరసిస్తూ వేతన బకాయిలు వెంటనే ఇవ్వాలని నిడదవోలు అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు,ఆశావర్కర్లు సిఐటియు దేశావ్యాప్త పిలుపు మేరకు మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం పట్టణ కూడలిలో మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిఐటియు డివిజన్ కార్యదర్శి గంటి కృష్ణ, కె గోపి, అంగన్వాడీ యూనియన్ నాయకులు కార్యకర్తలు పాల్గన్నారు. గంటి కృష్ణ మాట్లాడుతూ..స్కీమ్ వర్కర్లకు కనీసం వేతనం రూ.18వేలు పెంచాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. స్కీమ్ వర్కర్లకు పిఎఫ్, ఈఎస్ఐ, ఫించను వంటి సదుపాయాలు కల్పించాలన్నారు. రిటర్మైంట్ సదుపాయాలూ కూడా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వ్వాడీ వర్కర్లకు తక్షణం జీతం పెంచాలనీ అంగన్ వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు.