ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిలిప్పీన్స్ లో గన్ కాల్పుల కలకలం...ముగ్గురి హతం

international |  Suryaa Desk  | Published : Fri, Jul 29, 2022, 08:22 PM

అమెరికా తరహా గన్ కల్చర్..ఫిలిప్పీన్స్ లోనూ కనిపించింది. ఫిలిప్పీన్స్‌లో కాల్పులు జరిగి... ముగ్గురు వ్యక్తులు మరణించారు. రాజధాని మనీలాలోని యూనివర్సిటీ క్యాంపస్‌లో ఆదివారం మధ్యాహ్నం కాల్పులు ఘటన చోటుచేసుకుంది. క్యూజోన్ సిటీలోని అటెనియో డి మనీలా యూనివర్సిటీ గేట్ దగ్గర ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. దాంతో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. ఒకరరు గాయపడ్డారు. అలాగే కాల్పులకు తెగబడ్డ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


"కాల్పులు జరిపిన తర్వాత నిందితుడు కారులో పారిపోయేందుకు ప్రయత్నించాడని, అయితే పోలీసులకు పట్టుబడ్డాడని, ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ జరుపుతున్నాం." అని స్థానిక పోలీసు అధికారి రెమస్ మదీనా అన్నారు. ఈ హత్యకు గురైన వ్యక్తుల్లో ఓ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, యూనివర్శిటీ సెక్యూరిటీ గార్డు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నట్టు స్థానిక అధికారులు తెలిపారు.


అయితే లా స్కూల్ స్నాతకోత్సవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలెగ్జాండర్ గెస్ముండో హాజరు కావాల్సి ఉండగా.. కాల్పుల ఘటన తర్వాత రద్దు చేసుకున్నారు. కాల్పులు జరిగే సమయంలో ఆయన మార్గం మధ్యలో ఉన్నారు. వెనక్కి వెళ్లిపోమని అధికారులు ఆయనకు సూచించారు. అలాగే ఈ సంఘటన తర్వాత క్యాంపస్‌ను క్లోజ్ చేశారు. ఈ సందర్భంగా "ప్రస్తుతం క్యాంపస్ లాక్‌డౌన్‌లో ఉంది. ఫిలిప్పీన్స్ నేషనల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు." అని యూనివర్సిటీ ప్రకటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com