ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏకంగా 10 లక్షల మందిని నిరాశ్రయులను చేసిన అగ్నిప్రమాదం

international |  Suryaa Desk  | Published : Fri, Jul 29, 2022, 08:23 PM

కాలిఫోర్నియాలో అగ్నిప్రమాదం ఏకంగా 10 లక్షల మందిని నిరాశ్రయులను చేసింది. సెంట్రల్ కాలిఫోర్నియాలోని ఓ పార్క్‌లో మంటలు చెలరేగాయి. ఈ అగ్నికీలల్లో చిక్కుకుని 14,000 ఎకరాలకుపైగా ధ్వంసమైంది. దాంతో ఆ చుట్టుపక్కల వారంతా నిరాశ్రయులయ్యారు. బలవంతంగా ఆ పరిసర ప్రాంతాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. యోసిమిటే నేషనల్ పార్క్కు సమీపంలో శుక్రవారం మంటలు రాజుకున్నాయి. ఆదివారం నాటికి ఉగ్రరూపం దాల్చాయి. ఫలితంగా 10 లక్షల మంది ఆ ప్రాంతం విడిచి బయటకు వెళ్లాల్సి వచ్చింది.


అక్కడ రోజురోజుకు మంటలు పెరుగుతున్నాయి. ఏ మాత్రం అదుపులోకి రావడం లేదు. అక్కడ చెట్లన్నీ దహించుకుపోతున్నాయి. పార్క్ అంతా నాశనం అయింది. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మంటలు పరిసర ప్రాంతాలకు పాకడంతో అక్కడ పార్క్ చేసిన వాహనాలు కూడా కాలి బూడిదయ్యాయి. ఈ కార్చిచ్చు వేలాది మంది జీవితాలను ప్రమాదంలోకి నెట్టింది.


ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం రెండు రోజుల్లో 14 ఎకరాలకు పైగా అటవీ భూమి నాశనమైపోయింది. రెండు వేలకుపైగా అగ్నిమాపక సిబ్బంది మంటలను నియంత్రించేందుకు శ్రమిస్తున్నారు.17 హెలికాఫ్టర్లు సైతం వారికి సాయం చేస్తున్నాయి. కానీ పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. దీంతో కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ మారిపోసా కౌంటీలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అక్కడి పరిస్థితి మరింత దారుణంగా ఉందని పేర్కొన్నారు.అగ్నిప్రమాదం కారణంగా వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేయవలసి వచ్చింది.


యోస్మైట్ నేషనల్ పార్క్ ప్రపంచంలోని పురాతనమైనది. అందులో అతిపెద్ద చెట్లు ఉన్నాయి. ఇది యునైటెడ్ స్టేట్స్‌లో అత్యధికంగా సందర్శించే జాతీయ పార్కుల్లో ఒకటి. పార్క్‌లో బీభత్సంగా మంటలు వ్యాపిస్తున్నాయి. ఒక గ్రామీణ ప్రాంతంలో ఇళ్లు, పార్క్ చేసిన వాహనాలు కాలిపోయాయి. కనీసం పది నిర్మాణాలు ధ్వంసమయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com