కావాల్సిన పదార్ధాలు:
సన్న సగ్గుబియ్యం : 1 కప్పు, నూనె - 2 స్పూన్లు, కరివేపాకు - 1 రెబ్బ, ఆవాలు - 1 స్పూన్, జీలకర్ర - 1 స్పూన్, పచ్చి శనగపప్పు - 1స్పూన్, సాయి పెసరపప్పు - 1 స్పూన్, ఎండుమిర్చి - 2, కొత్తిమీర తరుగు - కొద్దిగా, ఉల్లిపాయ తరుగు - కొద్దిగా, పల్లీలు - అర కప్, నిమ్మకాయ - 1, ఉప్పు - తగినంత, కారం - తగినంత.
తయారీవిధానం:
-- ఈ రెసిపీ సన్న సగ్గుబియ్యం తో ఐతే, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా సన్న సగ్గుబియ్యాన్ని నీటితో కడిగి శుభ్రం చేసి, గంటపాటు నీటిలో నానబెట్టాలి.
-- సగ్గుబియ్యం బాగా నానిన తర్వాత పొయ్యి వెలిగించి, కళాయి పెట్టి నూనె వెయ్యాలి.
-- అందులో నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేసి చిటపట మని పేలేంత వరకు ఉంచి తీసెయ్యాలి.
-- ఇప్పుడదే బాణలిలో ఆవాలు , జీలకర్ర, పచ్చి శనగపప్పు, పల్లీలు, సాయి పెసరపప్పు వేసి దోరగా వేయించాలి.
-- ఇవి వేగుతుండగా అందులో ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తరుగు, ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యం, చిటికెడు కారం, ఉప్పు వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చెయ్యాలి.
-- ఆ తర్వాత ఇందులో నిమ్మరసం, కొద్దిగా ఉల్లిపాయ తరుగు జత చేసుకుని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది.