ప్రకృతి సిద్దంగా లభించే పండ్లలో నేరేడు పండు ఒకటి. సీజనల్ గా దొరికే ఈ పండును తప్పక తీసుకోవాలి. నేరేడులో ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ సి అధికంగా లభిస్తుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వర్షాకాలంలో వచ్చే అనేక రోగాలను తట్టుకునే శక్తిని ఇది ఇస్తుంది.
మధుమేహం ఉన్న వారికి నేరేడు పండు మంచి ఔషధం. దీనిని రోజూ తింటే రక్తంలోని చక్కెర శాతం క్రమబద్ధమవుతుంది. తరచూ దాహం వేయడం, మూత్రానికి పోవడం వంటి సమస్యలు అదుపులో ఉంటాయి.
కంటి చూపును మెరుగుపరచడంలో, ఎముకలను దృఢంగా ఉంచడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో, అధిక రక్తపోటును నియంత్రించడంలో ఈ పండ్లు మనకు ఎంతగానో సహాయపడతాయి.