ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎల్‌పీసీ సిలిండర్ పేలితే...మీకు రూ.50 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్‌

national |  Suryaa Desk  | Published : Fri, Jul 08, 2022, 07:43 PM

అవగాహన లేకే ఎన్నో అవకాశాలను మనంకోల్పోతూవుంటాం. అలాంటి వాటిలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ అంశం కూడా ఉంది.  ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి ఎల్‌పీసీ సిలిండర్ పేలితే.. కస్టమర్‌కి ఉండే రైట్స్ ఏమిటో చాలా మందికి తెలియదు. చాలా మంది ప్రజలకు ఇన్సూరెన్స్ లభిస్తుందనే విషయం తెలిసి కూడా ఉండదు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు, పెట్రోలియం కంపెనీలు రూ.50 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్‌ను అందిస్తున్నాయి. దీని కోసం కస్టమర్లు ఎలాంటి ప్రీమియాన్ని చెల్లించాల్సినవసరం ఉండదు.


ఎల్‌పీజీ కనెక్షన్ తీసుకునే కస్టమర్లందరికీ పెట్రోలియం కంపెనీలు వ్యక్తిగత ప్రమాద బీమాను కల్పిస్తున్నాయి. ఎల్‌పీజీ సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ కావడం వల్ల లేదా మరేదైనా కారణాలతో యాక్సిడెంట్ జరిగితే రూ.50 లక్షల వరకు కంపెనీలు ఆర్థిక సాయాన్ని అందజేస్తాయి. ఇన్సూరెన్స్ కంపెనీలతో భాగస్వామ్యంలో పెట్రోలియం కంపెనీలు ఈ ఇన్సూరెన్స్‌ను అందిస్తున్నాయి. గ్యాస్ సిలిండర్లు తీసుకునే ప్రతి ఒక్క కస్టమర్‌కి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ ప్రయోజనాన్ని అందిస్తున్నాయి.


డీలర్‌ డెలివరీ చేసే ముందు కస్టమర్ చాలా జాగ్రత్తగా ఉండాలి. సిలిండర్ బాగుందో లేదో డెలివరీ సమయంలో చెక్ చేసుకోవాలి. అయితే సిలిండర్ పేలుళ్ల ఘటనలు కస్టమర్ల ఇంట్లో జరిగితేనే పర్సనల్ యాక్సిడెంట్ కవర్‌ను కంపెనీలు అందిస్తాయి. ఈ ప్రమాదంలో, ఒకవేళ కస్టమర్ ప్రాపర్టీ, హౌస్‌కి ఏదైనా డ్యామేజ్ అయితే.. ఒక్కో యాక్సిడెంట్‌కి రూ.2 లక్షల వరకు ఇన్సూరెన్స్ క్లయిమ్ ఉంటుంది.


యాక్సిడెంట్ అయిన తర్వాత క్లయిమ్ ఎలా పొందాలంటే.. తొలుత ఈ విషయాన్ని లేఖ ద్వారా డిస్ట్రిబ్యూటర్‌కి, దగ్గర్లోని పోలీసు స్టేషన్‌లో తెలుపాల్సి ఉంటుంది. మీరు డిస్ట్రిబ్యూటర్‌కి తెలిపిన తర్వాత యాక్సిడెంట్‌కి గల కారణాలను విచారిస్తారు. ఎల్‌పీజీ సిలిండర్ పేలడం వల్లనే ప్రమాదం జరిగితే.. ఆ విషయాన్ని డిస్ట్రిబ్యూటర్ సంబంధిత ఆయిల్ కంపెనీకి, ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం అందిస్తారు. ఇన్వెస్టిగేషన్ రిపోర్టును చూసిన తర్వాత.. కంపెనీ వద్ద క్లయిమ్‌కి దరఖాస్తు చేస్తారు. దీని కోసం కస్టమర్ నేరుగా కంపెనీతో కాంటాక్ట్ కావాల్సినవసరం లేదు. అయితే ఎఫ్ఐఆర్ కాపీని, మెడికల్ బిల్లులను, ఒకవేళ ఎవరైనా చనిపోతే పోస్టుమార్టం రిపోర్టును, డెత్ సర్టిఫికేట్‌ను తమ వద్ద ఉంచుకోవాలి.


ఈ ప్రమాదంలో ఎవరైనా చనిపోతే.. ఒక్కో వ్యక్తికి రూ.6 లక్షల బీమా కవరేజ్ వస్తుంది. తీవ్ర గాయాలైతే.. ఒక్కో ఘటనకు రూ.30 లక్షల వరకు మెడికల్ ఖర్చుల కవరేజ్‌తో పాటు, ఒక్కో వ్యక్తికి రూ.20 లక్షలు వస్తాయి. ఒకవేళ ప్రాపర్టీ డ్యామేజ్ అయితే గరిష్టంగా రూ.2 లక్షల కవరేజ్‌ను ఇస్తుంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com