ఒక కప్ పచ్చి పాలు, ఒక స్పూన్ తేనె, చిటికెడు పసుపు, అరకప్ కలబంద గుజ్జు... ఈ పదార్ధాలన్నిటినీ ఒక గిన్నెలో తీసుకుని, బాగా మిక్స్ చేసి ఐస్ ట్రేలలో పోసి ఫ్రిడ్జ్ లో పెట్టండి. ఐదు గంటల తర్వాత ఇవి ఐస్ క్యూబ్స్ గా మారతాయి. ప్రతిరోజూ ఈ ఐస్ క్యూబ్స్ తో మీ ముఖాన్ని మర్దన చేయండి. దీని వల్ల ముఖంలో కొత్త కళ వస్తుంది. ముఖం ఉబ్బడాన్ని, కంటి కింద చర్మం ఉబ్బడాన్ని తగ్గిస్తుంది. వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. ముఖఛాయను పెంచుతుంది. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచి, రోజు మొత్తం ఫ్రెష్ గా ఉంచుతుంది. ఇందులో మనం వాడిన పాలు చర్మం ఉత్పత్తి చేసే మెలనిన్ ను తగ్గిస్తుంది. తేనెలోని యాంటీ ఆక్సిడెంట్లు ముఖాన్ని మెరిసిపోయేలా చేస్తాయి.