ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశభక్తులకి, దోపిడీ దొంగలకి తేడా తెలుసుకోకపోతే ఇలాంటి పరిస్థితులే ఏర్పడతాయి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 07, 2022, 12:28 PM

ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సోషల్ మీడియా లో పోస్ట్ లు పెట్టినందుకు గాను టీడీపీ నాయకురాలు గౌతు శిరీష మీద కేసులు నమోదు చేసిన సంగతి నిన్న జరిగింది. ఈ విషయంపై స్పందిస్తూ టీడీపీ అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.... బడుగుల కోసం జీవితాన్ని అంకితం చేసిన గౌతు లచ్చన్న వంటి యోధుడి మనవరాలిని రాజారెడ్డి రాజ్యాంగం వేధిస్తున్న తీరు చూస్తే బాధేస్తోంది. దేశభక్తులకి, దోపిడీ దొంగలకి తేడా తెలుసుకోకపోతే ఇలాంటి పరిస్థితులే ఏర్పడతాయి. గౌతు శిరీషను వేధించి మహిళల పట్ల తన సంస్కారం ఏపాటిదో జగన్ చాటుకున్నాడు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని ఒక అడకూతురును 7 గంటలు విచారణ పేరుతో వేధించిన జగన్  పూర్తిగా పతనం అయ్యాడు. రాష్ట్రంలో సమస్యలే లేనట్లు ప్రభుత్వం ఇలా వేధింపులతో...తాడేపల్లి ఆదేశాలను గుడ్డిగా పాటించే పోలీసులు... మహిళల పై నేరాలను మహిళల పట్ల కూడా కుళ్లు రాజకీయం చేయడాన్ని ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. ఈ దారుణాన్ని నేను ఖండిస్తున్నాను. అరికట్టడడంలో తమ పనితనం ఏంటో చూపించాలి. అంతేకాని ప్రభుత్వ పెద్దలతో పాటు దిగజారి పోలీసు గౌరవాన్ని పదే పదే తగ్గించకూడదు. గౌతు శిరీష పట్ల క్రూరంగా ఆలోచించిన ప్రభుత్వ సైకోలు... ఆమె ధైర్యం ముందు ఎప్పుడో ఓడిపోయారు అని తెలియజేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com