ఓలా ఎలక్ట్రిక్ తన కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రవేశపెట్టింది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ను ఉచితంగా పొందవచ్చని కంపెనీ కోఫౌండర్ భవిష్ అగర్వాల్ చెబుతున్నారు. ఒకవేళ మీకు ఉచితంగా ఈ స్కూటర్ కావాలనుకుంటే.. మీరు ఓ పని చేయాల్సి ఉంది. సింగిల్ ఛార్జ్లో ఈ స్కూటర్పై 200 కి.మీలు ప్రయాణించాల్సి ఉంది. అలా ఎవరైతే ప్రయాణిస్తారో వారికి మాత్రమే ఈ స్కూటర్ ఉచితం.
అయితే ఇప్పటి వరకు ఈ ఛాలెంజ్ను ఇద్దరు మాత్రమే పూర్తి చేశారు. ఈ ఛాలెంజ్ను పూర్తి చేసిన వీరికి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ను కంపెనీ ఉచితంగా అందించింది. మొత్తం 10 స్కూటర్లను ఇలా ఉచితంగా అందించాలని కంపెనీ నిర్ణయించింది. ఇంకా 8 స్కూటర్లు మిగిలి ఉన్నాయి. ఎనిమిది మందికి ఇంకా ఈ అవకాశం ఉంది. ఈ విషయాన్ని భవిష్ అగర్వాల్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. కొనుగోళ్ల విండోను ఓలా ఎలక్ట్రిక్ ఈ నెల 21 నుంచే తెరిచింది. ఈ విండో కింద ఓలా ఎస్1,. ఓలా ఎస్1 ప్రొ స్కూటర్లను విక్రయిస్తోంది.
ఇదిలావుంటే ఎలక్ట్రిక్ టూవీలర్ ప్రపంచంలో ఓలా స్కూటర్ ఓ ప్రభంజనం. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు వచ్చినంత డిమాండ్ ఏ ఎలక్ట్రిక్ స్కూటర్కు రాలేదు. కంపెనీ ఆఫర్ చేసిన శక్తివంతమైన ఫీచర్లు, బ్యూటీఫుల్ కలర్స్తో ఈ స్కూటర్లకు మార్కెట్లో మస్తు డిమాండ్ వచ్చింది. ప్రస్తుతం ఈ స్కూటర్లకు కోసం వేచిచూడాల్సినవసరం లేదు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసుకునేందుకు ఢిల్లీ వాసులకు సరికొత్తగా విండోను తెరిచింది. ఓలా ఎలక్ట్రిక్ తన ఎస్1 ప్రొ ధరను పెంచింది. ఈ స్కూటర్పై రూ.10 వేల మేర ధర పెంచుతున్నట్టు కంపెనీ ప్రకటించింది. దీంతో ప్రస్తుతం ఈ స్కూటర్ ధర రూ.1.40 లక్షలకు పెరిగింది. గతేడాది లాంచైనప్పుడు ఈ స్కూటర్ ధర ఎక్స్షోరూంలో రూ.1.30 లక్షలుగా ఉంది.