ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే లాభం గ్యారంటీ?

Technology |  Suryaa Desk  | Published : Mon, May 23, 2022, 03:35 PM

ప్రతి నెలా చిన్న మొత్తంలో పొదుపు చేయాలనుకునే వారి కోసం పలు రకాల స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో 'పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్' (పీపీఎఫ్) కూడా ఒకటి. ఈ స్కీమ్‌లో డబ్బులు పెట్టడం వల్ల పలు రకాల ప్రయోజనాలు పొందొచ్చు. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు. అంటే 15 ఏళ్ల పాటు ప్రతి నెలా డబ్బులు చెల్లించాలి. దీన్ని ఐదేళ్ల చొప్పున పొడిగించుకుంటూ వెళ్లొచ్చు. ప్రస్తుతం పీపీఎఫ్ ఖాతాపై 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం ప్రతి 3 నెలలకు ఒకసారి సమీక్షిస్తూ వస్తుంది.

ఈ స్కీమ్‌లో డబ్బులు పెట్టడం వల్ల ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు కూడా పొందొచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు డబ్బులు ఈ స్కీమ్‌లో పెట్టవచ్చు. ఉదాహరణకు మీరు నెలకు రూ.6 వేలు (రోజుకు రూ.200 పొదుపు) ఇన్వెస్ట్ చేయాలని భావిస్తే 15 ఏళ్ల తర్వాత రూ.19.5 లక్షలు లభిస్తాయి. అదే మరో ఐదేళ్లు మెచ్యూరిటీ కాలాన్ని పొడిగించుకుంటే అప్పుడు మీకు దాదాపు రూ.32 లక్షల వరకు వస్తాయి. మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం రూ.14.4 లక్షలు అవుతుంది. దీనికి రూ.17.5 లక్షల వడ్డీ వస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com