ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ప్రజలకు అలర్ట్..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 25, 2021, 12:49 PM

ఏపీకి తుఫాన్ ముప్పు పొంచి ఉంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది శుక్రవారం సాయంత్రం.. పూరీకి 590 కి.మీ. తూర్పు ఆగ్నేయంగా, కళింగపట్నానికి 740 కి.మీ. తూర్పుగా కేంద్రీకృతమై ఉంది. శనివారం తెల్లవారుజామున తీవ్ర వాయుగుండంగా మారుతుందని.. ఆదివారం నాటికి తుఫాన్‌గా మారనుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఆ తర్వాత 24 గంటల్లో పశ్చిమ వాయువ్యంగా పయనించి, దక్షిణ ఒడిసాలోని గోపాల్‌పూర్‌, ఉత్తర కోస్తాలో విశాఖపట్నం మధ్య.. కళింగపట్నానికి సమీపాన తీరం దాటుతుందని తెలిపింది. కోస్తా తీరం వెంబడి గంటలకు 50-60 కి.మీ.వేగంతో బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏపీలోని కోస్తా జిల్లాల్లో ఒడిశాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయి. ఆదివారం ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా స్తాంతాల్లో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయి.


కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవ్వొచ్చు. తెలంగాణ, ఛత్తీన్‌గఢ్‌లోనూ కొన్నిచోట్ల భారీ వానలు పడతాయని చెబుతున్నారు. వర్షాలుంటాయి. 27న మాత్రం ఛత్తీస్‌గడ్‌, ఒడిశా, తెలంగాణలో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముంది. ఏపీ విషయానికి వస్తే ఆదివారం శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు.. రాయలసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. సోమవారం శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు.. రాయలసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com