గుంటూరు: సత్తెనపల్లి గాంధీ బొమ్మల సెంటర్ లోని చల్లంచర్ల కాంప్లెక్స్ లో బంగారు తయారీ షాపులో చోరీ జరిగింది. అర్ధరాత్రి షటర్లు పగలగొట్టి దుండగులు చోరీకి పాల్పడ్డారు. సుమారు 10లక్షలు నగదు చోరీకి గురైనట్టు సమాచారం అందింది. పోలీసులు రంగంలోకి దిగి, సీసీటీవీ లో రికార్డ్ దృశ్యాలు పరిశీలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.