ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 04, 2024, 08:56 PM

సింహాచలం అప్పన్న చందనోత్సవం ఈ నెల 10న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ చందనోత్సవానికి వెళ్లలేకపోతున్న భక్తులకు ఓ గుడ్‌న్యూస్. ఈ పర్వదినం రోజున అప్పన్న చెంతకు వెళ్లలేదనే బాధ లేకుండా.. భక్తుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.చందనోత్సవం రోజున స్వామిని నిజరూపంలో దర్శనం చేసుకోలేనివాళ్ల కోసం పరోక్ష సేవ విధానాన్ని ప్రారంభించారు. సింహాచలం లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవం రోజున జరిగే పరోక్ష అష్టోత్తర శతనామార్చన సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు.


ఈ పరోక్ష అష్టోత్తర శతనామార్చన సేవ కోసం భక్తులు రూ.1,116 ఆన్‌లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించిన వారికి గోత్ర నామాలతో అప్పన్న స్వామి సన్నిధిలో అష్టోత్తర శతనామార్చన చేస్తారు. అలాగే భక్తులకు స్వామివారి నిర్మాల్య చందనం, ప్రసాదాన్ని పోస్టల్ ద్వారా పంపిస్తారు. చందనోత్సవం రోజు నేరుగా సింహాచలం రాలేని భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవలని అధికారులు సూచిస్తున్నారు. ఈ సేవకు సంబంధించిన తొలి టికెట్‌ను జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున కొనుగోలు చేశారు. భక్తులు https://www.aptemples.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా డబ్బులు చెల్లించాల్సి ఉంటుందన్నారు.


మరోవైపు చందనోత్సం రోజు స్వామివారిని నిజరూపంలో దర్శించుకోవచ్చు.. ఆ టికెట్లు కూడా నేటి నుంచి అందబాటులోకి రానున్నాయి. అలాగే ఆలయంలో ఎన్నికల నియామవళిని పాటిస్తూ దర్శనాలు ఉంటాయని అధికారులు తెలిపారు. అటు నిజరూప దర్శనం, ఇటు పరోక్ష సేవ టికెట్లను పొందాలని అధికారులు సూచించారు. అలాగే చందనోత్సవానికి భారీగా ఏర్పాట్లు చేస్తన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com