భారతీయ రైల్వే నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రేల్వే అనుబంధ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ తయారీ సంస్థ అయిన చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్లో 492 అప్రెంటీస్ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగానే అప్రెంటీస్ల ఎంపిక ప్రక్రియ ఉంటుందని తెలిపింది. దీనికి ఎటువంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ స్పష్టం చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ పోస్టులకు అక్టోబర్ 3లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. అర్హత, దరఖాస్తు విధానం, ఫీజు వంటి అన్ని వివరాల కోసం www.apprenticeshipindia.org వెబ్సైట్ను సందర్శించాలని అభ్యర్థులను కోరింది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, ఫిట్టర్, టర్నర్, పెయింటర్, ఎసి మెకానిక్ వంటి ఐటీఐ విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయస్సు 2021 సెప్టెంబర్ 15 నాటికి 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలని తెలిపింది. అయితే, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఆయా అభ్యర్థులకు గరిష్ట వయో సడలింపు ఉంటుంది. అర్హత విషయానికి వస్తే రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి లేదా సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అంతేకాక, సంబంధిత ట్రేడ్ విభాగంలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత విభాగంలో ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
అభ్యర్థులు ముందుగా www.apprenticeshipindia.org అధికారిక వెబ్సైట్ను ఓపెన్ చేయాలి.
మొదట వారి పేరు, ఈ–మెయిల్ ఐడీ, పుట్టిన తేదీ వంటి వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్వర్డ్తో లాగిన్ అయ్యి అవసరమైన అన్ని డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వారి డాక్యుమెంట్లను పరిశీలించి మెరిట్ లిస్ట్ తయారు చేస్తుంది. ఈ అప్రెంటీస్ పోస్టులను పదోతరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థుల మార్కులు, కేటగిరీ, వయస్సు ఇలా అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. ఎంపికైన అయిన అభ్యర్థుల ఈ–మెయిల్ ఐడీకి కాల్ లెటర్ను పంపిస్తారు.