ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమీషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఈ నెల 23న జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. హరినారాయణన్ ఒక ప్రకటన లో తెలిపారు. ఈ నెల 23న ఉదయం 5. 00 గంటలకు శేషాద్రి ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్ లో తిరుపతి చేరుకుంటారు. ఉదయం 10. 00 గంటలకు తిరుపతి పద్మావతి అతిధి గృహంలో ప్రెస్ మీట్ నిర్వహించి10. 30 గంటలకు పోషన్ మాహ్ పిఎల్ఆర్ గార్డెన్స్ తనపల్లి రోడ్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. శ్రీపద్మావతి అతిధి గృహంలో 11. 30 నుండి మ. 2. 00 గంటల వరకు మహిళల నుండి వినతులు స్వీకరిస్తారు. అనంతరం మ. 3. 00 గంటలకు తిరిగి పిఎల్ఆర్ లో జరిగే “ఉమెన్ ఎంపవర్ మెంట్ ప్రోగ్రాం” లో పాల్గొని 5. 00 గంటలకు వైఎస్ఆర్ కడప జిల్లాకు బయలు దేరి వెళ్లనున్నట్లు కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.