అన్నాడీఎంకే నేత పన్నీర్ సెల్వం సతీమణి విజయలక్ష్మీ... హార్ట్ ఎటాక్తో కన్నుమూశారు. విజయలక్ష్మీ రెండు వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాంతో ఆమెకు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఐతే... ఆమెకు శరీరంలోని కొన్ని అవయవాలకు అనారోగ్య సమస్యలున్నాయి. ఈ పరిస్థితుల్లో బుధవారం ఆమె ఆరోగ్యం క్షీణించింది. సడెన్గా హార్ట్ ఎటాక్ రావడంతో... ఆమెను కాపాడటం డాక్టర్ల వల్ల కాలేదు.విషాదంలో ఓపీఎస్: పన్నీర్ సెల్వం పార్టీ అన్నాడీఎంకే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఆ తర్వాత ఈ పార్టీలో నిస్తేజం అలుముకుంది. మళ్లీ ఇప్పట్లో ఎన్నికలు జరగవనే ఉద్దేశంతో పార్టీ శ్రేణులు కూడా రాజకీయంగా యాక్టివ్గా లేవు. ఈ సమయంలో... తమిళనాడుకి ఒకప్పుడు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా చేసిన పన్నీర్ సెల్వం ప్రస్తుతం అసెంబ్లీలో విపక్ష ఉపనేతగా కొనసాగుతున్నారు. జీవిత భాగస్వామిని కోల్పోయి ఆయన తీవ్ర విషాదంలో మునిగిపోయారు.