మూడు రోజుల లాక్డౌన్ విధించడంతో దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అదుపు చేయగలిగామని న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ తెలిపారు. వైరస్ను అడ్డుకోవడంలో ప్రజలు సహకరించాలని కోరారు. ఆరునెలలుగా ఆ దేశంలో ఒక్క కమ్యూనిటీ కేసు కూడా వెలుగుచూడలేదు. అయితే ఈ వారం ప్రారంభంలో అక్లాండ్కు చెందిన ఒక వ్యక్తి కరోనా బారిన పడ్డాడు. దీంతో వైద్యాధికారులు ఆ వ్యక్తికి కరోనా ఎలా సోకిందో గుర్తించగలిగారని అన్నారు.ఆ వ్యక్తికి డెల్టా వేరియంట్ సోకిందని, ఆగస్ట్ 7న సిడ్నీ నుండి వచ్చినట్లు ప్రధాని తెలిపారు. ఆ వ్యక్తిని క్వారంటైన్లో ఉంచి చికిత్స నందించామని.. అయితే భయపడినట్లుగా వైరస్ వ్యాప్తి కొనసాగలేదని సూచించారు. కేసుల సంఖ్య ఒక్కరోజులో 11 పెరిగి..
మొత్తం 21కి చేరాయని అన్నారు. లాక్డౌన్తో వైరస్ మూలాలను కనుగొనడం, వ్యాప్తిని నివారించడం, లాక్ చేయడం, అలాగే అదుపుచేయగల సామర్థ్యాన్ని పెంచిందని అన్నారు. గురువారం మొదటి కేసు గుర్తించిన అనంతరం 15 నెలల అనంతరం దేశంలో మూడు రోజుల పాటు పూర్తి లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే ఆక్లాండ్, కోరమాండల్లో మరో వారంరోజులపాటు ఆంక్షలు కొనసాగనున్నాయి. కేసులు పెరగక ముందే తగ్గించడానికి సిద్ధంగా ఉంటామని, వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇదే సరైన విధానమని అన్నారు. ఈ కేసుకు ముందు ఇక్కడ కేసులు లేవని తాము నమ్ముతున్నామని అన్నారు. రెడ్జోన్గా పేర్కొంటున్న సిడ్నీ విమానంలో ఆ వ్యక్తి వచ్చాడని అన్నారు.