చంద్రబాబు ఆరోపణలపై సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. ప్రజల్లో అలజడి రేకెత్తించడానికే చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. టీకాల పరిస్థితి ఏంటో రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసని అన్నారు. అయినా ప్రభుత్వంపై, కలెక్టర్లపై నిందలు మోపడానికి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో లేరనే విషయాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న కలెక్టర్ల పనితీరు పట్ల తాను గర్వపడుతున్నానని సీఎం చెప్పారు. రుయా ఆసుపత్రి ఘటన తీవ్రంగా కలిచి వేసిందన్నారు. పక్క రాష్ట్రం నుంచి ఆక్సిజన్ రావడంలో ఆలస్యం జరగడంతో ప్రమాదం జరిగినప్పటికీ తాము బాధ్యత తీసుకుంటామని అన్నారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందజేస్తామన్నారు.